AKP: అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పరిధిలో ప్రమాదాల నివారణకు పోలీసులు భారీ వాహనాలపై తనిఖీలు చేపట్టారు. వెదురువాడ గ్రామం సమీపంలో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తుండగా పరిమితికి మించి సుమారు 25 టన్నుల అదనపు లోడుతో వెళ్తున్న టిప్పర్ను గుర్తించి అడ్డుకున్నారు. వాహనానికి రూ.20 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఓవర్లోడ్ టిప్పర్పై చర్యలు


