అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (108) సెంచరీతో చెలరేగాడు. సంజూ శాంసన్ (50) హాఫ్ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 29, శివమ్ దూబే 14 పరుగులు చేశారు. అఫ్ఘాన్ బౌలర్లలో ఓమర్జాయ్ 2 వికెట్లు, రషీద్ ఖాన్, అహ్మద్జాయ్ చెరో వికెట్ తీశారు.
క్రీడలు
టీమిండియా భారీ స్కోర్


