హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఇంటింటికి సర్వే..!

కృష్ణా: మచిలీపట్నం శారదానగర్‌లో వైద్య సిబ్బంది గురువారం ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు వ్యాధుల నియంత్రణలో భాగంగా పీడీపీ (PDP), ఎంఎల్‌డీ (MLD), ఎన్‌ఎల్‌ఈపీ (NLEP) సర్వేలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ భట్రాజు సూరిబాబు,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం సుధారాణి పాల్గొన్నారు.