అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్కు టీమిండియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడో టీ20లో వైభవ్ను ఆడించడం మంచి ఆప్షనే అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే సత్తా చాటిన ఇషాన్ కిషన్కు బ్రేక్ ఇస్తే మంచిదని చెప్పాడు. దీంతో అభిషేక్ లేదా సంజూతో వైభవ్ ఓపెనింగ్ చేస్తాడని వసీం పేర్కొన్నాడు.
క్రీడలు
IND vs AFG: అభిషేక్, సంజూతో పాటు వైభవ్!


