హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంకలగుంటలో 21 నుంచి భూముల రీసర్వే

PLD: నకరికల్లు (మం) కుంకలగుంటలో ఈ నెల 21 నుంచి భూముల రీసర్వే ప్రారంభం కానుందని తహసీల్దార్ కే. పుల్లారావు తెలిపారు. రైతులు సర్వే సమయంలో భూముల వద్ద అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరించాలని సూచించారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్, రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు పాస్‌బుక్ ప్రతులు, రెండు ఫొటోలు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.