హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అసైన్డ్‌ భూములు పేదలకే పంచాలి'

SRCL: సిరిసిల్ల నియోజకవర్గంలో కబ్జాకు గురైన అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలో సమావేశంలో మాట్లాడుతూ.. సుమారు 8 వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. ఇప్పటికే గుర్తించిన 2,400 ఎకరాల వివరాలు వెల్లడించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.