హైదరాబాద్: 28°C
క్రీడలు

చిన్నజట్టుపై అతి కష్టంగా గెలిచిన పాక్

ఆసియా గేమ్స్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌పై పాక్ అతి కష్టంగా గెలిచింది. మరోవైపు చైనా- బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో బంగ్లా నేరుగా సెమీస్‌లోకి అడుగు పెట్టింది. శుక్రవారం భారత్- జపాన్ విజేతతో బంగ్లా సెమీస్‌లో తలపడనుంది.