KMR: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాపాలన స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ
మహాత్మునికి నివాళులర్పించిన కలెక్టర్


