హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

UPDATE: నిధుల గోల్‌మాల్.. ఇద్దరిపై కేసు

TPT: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 32.75 లక్షల ఆరోగ్యశ్రీ నిధుల దుర్వినియోగం వెలుగుచూసింది. వైద్యాధికారులకు రావాల్సిన ఇన్సెంటివ్‌లు, పేషెంట్ కేర్ నిధులను మళ్లించేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ.. ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూనియర్ అసిస్టెంట్ జీ. లక్ష్మీ ప్రసన్న, చందులపై రెండో పట్టణ PSలో కేసు నమోదైంది.