హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే

PPM: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కీలకంగా పనిచేయాలని జగన్ సూచించినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు.