హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన ముద్రగడ కుమారులు

GNTR: వైసీపీ అధ్యక్షుడు, వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని ముద్రగడ పద్మనాభం కుమారులు ముద్రగడ బాలు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ముద్రగడ గిరిబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రలో పాల్గొని కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.