హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

PLD: నరసరావుపేట పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు సిబ్బందికి ఉచిత గుండె, కంటి, దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఏఆర్‌ డీఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ ఎస్. కృష్ణ, వెల్ఫేర్‌ ఆర్‌ఐ ఎల్. గోపీనాథ్‌లు పాల్గొన్నారు.