హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి

NDL: సంజామల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, వైద్యం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను మంత్రి బుధవారం ఆదేశించారు.