హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవో 118 ప్రకారం ఇళ్లు రెగ్యులరైజ్ చేస్తాం: సీఎం

RR: ఎల్బీనగర్‌లోని జీవో 118 బాధితులకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. జీవో 118 బాధితులు 9,500 మందికి పైగా ఉన్నారని పేర్కొన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచే ఈ సమస్య ఉందన్నారు. త్వరలోనే జీవో 118 ప్రకారం అక్కడ నివసిస్తున్న వారి ఇళ్లు, అపార్ట్‌మెంట్లను రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడించారు.