హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు'

KRNL: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, ఓవర్‌చార్జింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఇవాళ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రీచ్‌లు, స్టాక్‌ పాయింట్లను తరచూ తనిఖీ చేయాలని సూచించారు. ఏప్రిల్‌ నుంచి అక్రమ రవాణాకు పాల్పడిన 80 వాహనాలను సీజ్‌ చేసి రూ.18.45 లక్షల జరిమానా విధించినట్ు తెలిపారు.