TPT: పిచ్చాటూరులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని, పిల్లలు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని అన్నారు. సమతుల్య ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోషకాహార వంటకాల ప్రదర్శన నిర్వహించి, వాటి ప్రాధాన్యాన్ని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పోషకాహారమే ఆరోగ్యానికి కీలకం: ఎమ్మెల్యే


