హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సీఐ

ADB: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌, యాంటీ డ్రగ్‌ సెల్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంగీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.