హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతినగర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నిర్మల్‌ జిల్లా శాంతినగర్‌లో నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కౌన్సిలర్‌ కొండాజీ రాఘవేంద్రచారి లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.