HYD: తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుపై సింగపూర్ ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన ప్రతినిధులు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్ రంగానికి తోడు మూసీ పునరుజ్జీవనం, రివర్ఫ్రంట్ అభివృద్ధి, నైట్ ఎకానమీ, నెట్జీరో ప్రాజెక్టులపై సీఎంతో ప్రతినిధులు చర్చలు జరిపారు.
తెలంగాణ
సీఎంతో సింగపూర్ ప్రతినిధి బృందం భేటీ


