హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాగీర్‌పల్లిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

KNR: జాగీర్‌పల్లిలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను గ్రామ కాంగ్రెస్‌ నాయకులు బుధవారం పంపిణీ చేశారు. వడిజ జానకికి రూ.37,500, నెల్లి రాజ్యలక్ష్మీకి రూ.34,000, రాధారపు కనకవ్వకు రూ.12,500 చొప్పున అందజేశారు. సహాయనిధి మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్‌ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.