హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన MP

AKP: రోలుగుంట మండలం నిండుగొండ–బుచ్చెంపేట రహదారి నుంచి రాజుపేట వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కేఎస్ఎన్‌ఎస్ రాజు శంకుస్థాపన చేశారు. రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ రహదారితో రాజుపేట, పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. కార్యక్రమంలో నాయకులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.