హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అద్దంకికి మంత్రులు అనిత, గొట్టిపాటి

BPT: హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ గురువారం అద్దంకి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం ఎన్‌ఎస్‌పీ కాలనీలో రూ.7.72 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రం, శింగరకొండలో రూ.2.25 కోట్లతో నిర్మించిన ఫైర్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు.