హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

MLG: నాయి బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. నాయి బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.