NLG: చింతలపాలెం గ్రామంలో సోమవారం వినాయక మండపం వద్ద జరిగిన తోపులాటలో పూజారి శ్రీమన్ దత్త ప్రసాద్ అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనను ఖండిస్తూ మండలంలోని అన్ని గ్రామాల అర్చకులు మంగళవారం వినాయక మండపాల్లో పూజలను బహిష్కరించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, యువకులు, మండప నిర్వాహకులు సంయమనం పాటించి పురోహితులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
పూజారి మృతి ఘటనపై అర్చకుల నిరసన!


