హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RTC బస్సులను తనిఖీ చేసిన డీఎం శ్యామలాదేవి

BPT: వేటపాలెం మండల పరిధిలోని జాతీయ రహదారి-216 వద్ద RTC బస్సులను డీఎం శ్యామలాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్ణీత స్టాపుల్లోనే బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అతివేగంతో వాహనాలు నడపవద్దని డ్రైవర్లకు సూచించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారితో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఆదేశించారు.