హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక నిమజ్జనంపై పోలీసుల సూచనలు

GNTR: తెనాలిలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులకు డీఎస్పీ జనార్ధన్‌రావు కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, మైకులు నిర్ణీత పరిమితిలో వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, బైక్ స్టంట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. నిర్ణీత ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని సూచించారు.