హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్య హత్య కేసులో భర్త అరెస్ట్

SDPT: సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భార్య హత్య కేసులో మద్దూరి బాలలింగం అలియాస్‌ రాకేష్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. భార్య రోజీ పర్వీన్‌పై అనుమానాలు, కుటుంబ కలహాలే హత్యకు కారణమని విచారణలో నిందితుడు అంగీకరించాడన్నారు. అతడి నుంచి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.