హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. టాప్ 2లో దీప్తి శర్మ 

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. ఆసియా కప్‌లో 14 వికెట్లతో టాప్ టేకర్‌గా నిలిచిన దీప్తి శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి దూసుకొచ్చింది. అలాగే 236 పరుగులతో షెఫాలి వర్మ ఆరో ర్యాంకుకు చేరగా, స్మృతి 5, హర్మన్‌ప్రీత్ 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ షెఫాలి ఐదు స్థానాలు మెరుగుపరుచుకుంది.