హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కామన్‌వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌లో బాపట్ల ఎంపీ

BPT: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్‌వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (2026)లో భారత పార్లమెంటరీ డెలిగేషన్ ప్రతినిధిగా లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. కామన్‌వెల్త్ దేశాల ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం, పార్లమెంటరీ విధానాలు, ప్రపంచ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు.