హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యం'

కోనసీమ: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గం చూపించడమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజలు తమ సమస్యలను మంత్రికి నేరుగా వివరించి, పరిష్కారం కోరుతూ మొత్తం 28 అర్జీలు సమర్పించారు.