HNK: హన్మకొండ నగరంలోని పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద మంగళవారం సిరిసిల్ల డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మలుపు తిరిగే సమయంలో విద్యుత్ వైర్లకు తగలడంతో భారీ వృక్షం కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పార్క్ చేసిన రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకటరత్నం ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
తెలంగాణ
ఆర్టీసీ బస్సుపై కూలిన భారీ వృక్షం


