MNCL: చెన్నూరు పట్టణంలోని పుష్కర ఘాట్ను కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. రాబోయే పుష్కరాలను పురస్కరించుకొని పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తెలంగాణ
పుష్కర ఘాట్ అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ


