MDCL: అల్వాల్లో భర్త భార్యను హత్య చేసిన దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని TRS నేతలు కోరారు. ఈ మేరకు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంఛార్జ్ వేముల భవాని, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
అల్వాల్ ఘటనపై సమగ్ర విచారణకు ఫిర్యాదు


