ఖమ్మం: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాలికల కబడ్డీ ఎంపికల్లో కామేపల్లి (M) పొన్నెకల్లు హైస్కూల్ విద్యార్థిని ఏ.తేజస్విని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున తేజస్విని పాల్గొననుంది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు పొన్నెకల్లు విద్యార్థిని


