GNTR: పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనెమలిపూరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో కారులోని ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కారు బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు


