హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్

WGL: ధర్మసాగర్‌లోని నీటి శుద్ధీకరణ ప్లాంట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా తాత్కాలికంగా మంగళవారం నిలిచిపోయింది. దీంతో పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. నీటి పంపింగ్ పునఃప్రారంభించే వరకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.