హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: ధరూర్‌ మండలంలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ రమేశ్ బాబు తెలిపారు. పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో సోలార్‌ ఫీడర్‌ పనులు చేపట్టనున్నారు. ధరూర్‌ టౌన్‌, పార్చర్ల, బూరేడిపల్లి, జాంపల్లి ఫీడర్ల పరిధిలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.