హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోల్‌లో వ్యక్తి దారుణ హత్య

HYD: నాగోల్‌లో దారుణ హత్య కలకలం రేపింది. బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలోని సుప్రీం వైన్స్‌లోకి చొరబడిన సుమారు 10 మంది వ్యక్తులు.. ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. దాడి అనంతరం నిందితులు కత్తులను అక్కడే వదిలి కారులో పరారైనట్లు తెలుస్తోంది.