హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో అక్రమ తవ్వకాలు

MBNR: బాలానగర్ మండలం ఎక్కువైపల్లి చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా నల్లమట్టిని టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. ట్రిప్పుకు రూ.3 నుంచి రూ.5 వేలకు విక్రయిస్తూ దందా సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో చెరువు కట్టలు దెబ్బతిని సాగునీటికి ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.