హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

SRD: పటాన్‌చెరు‌లో పండుగ రోజైనా ఆ ఇంట్లో వెలుగులు నిండలేదు. ఉపాధి కోసం వెళ్తున్న ఒక కుటుంబాన్ని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఇస్నాపూర్ జంక్షన్ వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో ముబారక్ పూర్‌కు చెందిన నడిమింటి నర్సింలు (50) లారీ బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.