హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోతులమడుగు–గోపన్నపల్లి బ్రిడ్జికి రూ.4 కోట్లు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని పోతులమడుగు–గోపన్నపల్లి మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఏళ్లుగా రాకపోకల సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) చొరవతో నిధులు సాధించినట్లు తెలిపారు. బ్రిడ్జి మంజూరుపై దేవరకద్ర ప్రజలు ఎమ్మెల్యేను అభినందించారు.