కృష్ణా: జిల్లా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) జిల్లా మహాసభలు ఈ నెల 19న గన్నవరంలో నిర్వహించనున్నట్లు సీనియర్ జిల్లా నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువలు, ప్రజా హక్కుల పరిరక్షణ, న్యాయవాదుల సంక్షేమం, సామాజిక న్యాయంపై చర్చిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
19న గన్నవరంలో ఐలూ జిల్లా మహాసభలు


