PPM: జర్నలిస్టుల రక్షణ, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురంలో APWJF ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాల్గవ స్తంభమని పేర్కొన్నారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు బస్పాస్లు, హెల్త్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'


