AKP: సెక్యూరిటీ గార్డులు, స్కూల్ వాచ్మెన్ల సమస్యల పరిష్కారానికి సంఘటితమై ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి గనిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. అనకాపల్లి సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 8 గంటల పని విధానం అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వారి సమస్యలు పరిష్కరించాలి'


