NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు ఏఈ గోవర్ధనగిరి ప్రజలకు పలు సూచనలు చేశారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు సమీపంలో వినాయక విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల వద్ద విద్యుత్ తీగలు తెగిపడినట్లు లేదా వేలాడుతున్నట్లు కనిపిస్తే వాటిని తాకరాదన్నారు. సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇందుకూరుపేట ప్రజలకు ఏఈ సూచనలు


