హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులకు పెన్షన్‌ అందేలా చూడాలి: నక్కా

GNTR: ఎన్టీఆర్‌ భరోసా కొత్త పెన్షన్లకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సూచించారు. వేమూరులోని ఎన్టీఆర్‌ పురవేదిక వద్ద ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌పై లబ్ధిదారుల సహాయక, అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.