హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో సమస్యలకు పరిష్కారం: మంత్రి బీసీ

నంద్యాల: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదివారం స్వీకరించారు. న్యాయపరమైన సమస్యలపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.