MGL: మంగపేట మండలంలోని రైతు వేదికలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. ఒక్కో క్లస్టర్లో రూ. 22 లక్షలతో నిర్మించిన భవనాలకు తాళాలు వేసి ఉండటంతో తలుపులు, కిటికీలు ధ్వంసమై గుబురు మొక్కలు పెరిగాయి. రైతు సమావేశాలు, శిక్షణ తరగతులు జరగాల్సిన వేదికలు నిరుపయోగంగా మారడంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా రైతు వేదికలు


