NRPT: ఉట్కూరు మండలం బిజ్వార్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పార్టీ జిల్లా కార్యదర్శి బి. రాము, టీపీటీఎఫ్ అధ్యక్షుడు దేవేందర్, నాయకులు కృష్ణ, సలీం ఈ కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో కులవివక్ష, దోపిడీ వ్యవస్థ పూర్తిగా నశించి.. సమసమాజ స్థాపన జరిగే వరకు యువకులు, ప్రజలు ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.
తెలంగాణ
సీపీఐ ఎంఎల్, మాస్లైన్ శిక్షణ తరగతులు ప్రారంభం


