అన్నమయ్య: ములకలచెరువు మండలంలో శుక్రవారం కారు ఢీకొని రెడ్డి ప్రసాద్ (23) తీవ్రంగా గాయపడ్డాడు. వేపూరికోట పంచాయతీ ఆవులవారిపల్లెకు చెందిన ప్రసాద్ బైక్పై బురకాయలకోటకు వెళ్లి తిరిగి వస్తుండగా సెంట్రల్ స్కూల్ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు


